ఓటమి అంచున సఫారీలు... సంబరాలు మొదలుపెట్టిన భారత అభిమానులు

  • ఫాలో ఆన్ ఆడుతున్న సఫారీలు
  • రెండో ఇన్నింగ్స్ లో 121 రన్స్ కు 8 వికెట్లు డౌన్
  • విజృంభించిన భారత పేసర్లు
రాంచీ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఓటమి ముంగిట నిలిచింది. 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఫాలో ఆన్ ఆడుతున్న సఫారీలు మూడో రోజు ఆటలో చివరికి 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేశారు. టీమిండియా పేసర్ షమీ అద్భుత స్పెల్ తో దక్షిణాఫ్రికా టాపార్డర్ ను కుప్పకూల్చాడు. 2 వికెట్లు తీయడం ద్వారా ఉమేశ్ యాదవ్ కూడా సఫారీల పతనంలో పాలుపంచుకున్నాడు. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన టీమిండియా చివరిదైన మూడో టెస్టులోనూ విజయం దిశగా పయనిస్తోంది. భారత్ గెలుపునకు 2 వికెట్లు కావాలి. సౌతాఫ్రికా ఇంకా 214 పరుగులు వెనుకబడి ఉంది. కోహ్లీ సేన విజయంపై ఎవరికీ సందేహాలు లేకపోవడంతో అభిమానులు అప్పుడే సంబరాలు షురూ చేశారు.
Go Back to Shorts
India
South Africa
Cricket
Ranchi

More Telugu News